AP: YCP అధినేత జగన్ను మనుషుల జాబితాలో చేర్చలేమంటూ.. మంత్రి సంధ్యారాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన చర్యల వల్ల YCPకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని.. బొత్స, ధర్మాన ఆ విషయాన్ని జగన్కు ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. విశాఖ రాజధాని అని జగన్ చెప్పినా ప్రజలు నమ్మలేదని, అందుకే YCP 11 స్థానాలకే పరిమితమైందన్నారు. జగన్ ఇప్పటికైనా మారకుంటే ఆ 11 స్థానాలు కూడా రావని ఎద్దేవా చేశారు.
వార్తలు
'జగన్ను మనుషుల జాబితాలో చేర్చలేం'


