VZM: భోగాపురం సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం, విశాఖపట్నం కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను సమీక్షించారు. నేవీ హెలికాప్టర్లతో గాలింపు కొనసాగుతోందని అధికారులు వివరించారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలన్నారు.
వార్తలు
VIDEO: గల్లంతైన మత్స్యకారులపై మంత్రి ఆరా


