హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కెట్ యార్డును సందర్శించిన ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి

ATP: అనంతపురం మార్కెట్ యార్డు ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి సంత సందర్భంగా మార్కెట్ యార్డును సందర్శించారు. యార్డు సెక్రటరీ గోవింద్‌తో కలిసి స్థానికంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారంపై సెక్రటరీ గోవింద్‌తో చర్చించారు.