హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంధన ధరల ఎఫెక్ట్.. ట్రాక్టర్ అద్దెలకు రెక్కలు

MDCL: ఖరీఫ్ సాగు వేళ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ట్రాక్టర్ అద్దెలపై పడింది. కీసర, ఘట్‌కేసర్, షామీర్‌పేట్ ప్రాంతాల్లో దుక్కి దున్నడం కోసం ప్లౌకు గంటకు రూ.1,500, డోజింగ్ డబుల్‌కు రూ.2,000 వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. గతంతో పోలిస్తే అద్దెలు సుమారు 20 శాతం పెరగడంతో సాగు ఖర్చులు మరింత పెరిగాయని చెబుతున్నారు.