హైదరాబాద్: 28°C
క్రైమ్

గ్రీవెన్స్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి

AP: గుంటూరు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తండ్రి, బాబాయ్ తమను వేధిస్తూ, 15 సవర్ల బంగారం, రూ.5 లక్షలు లాక్కుని ఇంటి నుంచి వెళ్లగొట్టారని, తండ్రి రెండో పెళ్లి చేసుకుని వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని తెలిపింది. అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.