హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆదాయాల గోల్‌మాల్.. రాజేశ్‌ మెహతాపై సెబీ వేటు

పసిడి రిఫైనర్ సంస్థ రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ గత ఐదేళ్లలో తన ఏకీకృత ఆదాయాలను రూ.15 లక్షల కోట్లకుపైగా ఎక్కువ చేసి చూపించిందని సెబీ పేర్కొంది. మొత్తం రూ.15.18 లక్షల కోట్ల ఆదాయంలో 99.8% అనుబంధ కంపెనీల నుంచే వచ్చినట్లు తప్పుడు గణాంకాలు చూపారు. సరైన రికార్డులు సమర్పించకపోవడంతో కంపెనీ ఛైర్మన్, సీఈఓ రాజేశ్‌ మెహతాపై సెబీ నిషేధం విధించింది.