కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 5,46,519 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 1274 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 39 మంది లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 6894 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు


