హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్నిప్రమాదం.. విద్యుత్ ప్యానెల్ బోర్డులు దగ్ధం

కోనసీమ: అమలాపురం ఎస్ఎస్ నాయుడు లేఅవుట్లోని డీఎన్ఆర్ ప్లాజా సెల్లార్లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో విద్యుత్ ప్యానెల్ బోర్డులు అగ్నికి దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో అమలాపురం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపుచేశారు.