PPM: సాలూరు 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో మంచంపై ఇద్దరు రోగులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తండ్రి స్వర్గీయ జన్ని ముత్యాలు పేరుతో 10 మంచాలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు .
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి


