హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బనగానపల్లె రింగ్‌ రోడ్డు పనుల పరిశీలన

నంద్యాల: మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదివారం బనగానపల్లె రింగ్‌ రోడ్డు పనులను పరిశీలించారు. సాయిబాబా ఆలయం నుంచి రవ్వలకొండ వరకు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూ.56 కోట్లతో 10.68 కి.మీ మేర చేపట్టిన పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. రోడ్డు పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య తగ్గి రాకపోకలు సులభతరం కానున్నాయిని పేర్కొన్నారు.