హైదరాబాద్: 28°C
తెలంగాణ

980 గ్రాముల శిశువుకు పునర్జన్మ

SRD: నెలలు నిండక 980 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు సంగారెడ్డిలోని శిశురక్ష ఆసుపత్రి వైద్యులు 50 రోజుల పాటు చికిత్స అందించారు. వెంటిలేటర్‌, డయాలసిస్‌తో చికిత్స అందించడంతో ప్రస్తుతం శిశువు బరువు 1.6 కిలోలకు చేరింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసుపత్రికి వెళ్లి వైద్యులు, యాజమాన్యాన్ని అభినందించారు.