HYD: మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలో ప్లాట్లను ఆక్రమించేందుకు యత్నించారంటూ సినీ నిర్మాత సీ. కళ్యాణ్ సహా పలువురిపై సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సర్వే నంబర్లు 12, 12A, 13లోని తమ ప్లాట్లలోకి ప్రవేశించి బ్లూ షీట్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్యామ్సింగ్ పోలీసులను కోరారు.
తెలంగాణ
సినీ నిర్మాత సీ. కళ్యాణ్పై పోలీసు ఫిర్యాదు


