AKP: జిల్లాలో శనివారం సగటున 15.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చోడవరంలో 56.0 మి.మీ, నర్సీపట్నంలో 53.6 మి.మీ వర్షం కురిసింది. కోటవురట్లలో 42.6 మి.మీ, రావికమతంలో 34.6 మి.మీ రికార్డైంది. అనకాపల్లి, రాంబిల్లి సహా ఏడు మండలాల్లో అసలు వర్షం పడలేదు. జిల్లాలో సాధారణం కంటే 43.5 శాతం లోటు నమోదైందని, దీంతో పంటల సాగుపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చోడవరంలో అత్యధిక వర్షపాతం నమోదు


