హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థికి రూ.20 వేల ఆర్థిక సాయం

నంద్యాల 19వ వార్డు పొన్నాపురానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఎడవల్లి వసంత్‌కుమార్‌కు రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా దాతలు దండే రవీంద్రనాథ్‌రెడ్డి, దండే రంగశేఖర్‌రెడ్డి సాయాన్ని అందజేశారు. పేద విద్యార్థుల చదువుకు దాతలు అండగా నిలవాలని మంత్రి పేర్కొన్నారు.