TPT: పెరటాసి మాసం సందర్భంగా టీటీడీకి అనుబంధ ఆలయమైన శ్రీనివాస మంగాపురం శ్రీవారి ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఆలయ నిర్వాహకుల వివరాల మేరకు ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4.30 గంటల నుంచి విశ్వరూప దర్శనం నిర్వహించనున్నారు. 6.30 గంటలకు మొదటి బెల్, 7.30 గంటలకు రెండో బెల్ నిర్వహించి, ఉదయం 8 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు


