హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: తోట్లవల్లూరు మండలంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. సబ్‌స్టేషన్‌లో నిర్వహణ, మరమ్మతు పనుల కారణంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ ఏఈ దేవదాసు తెలిపారు. వల్లూరుపాలెం, పాములలంక, దేవరపల్లి, పెనమకూరు, యాకమూరు, తోట్లవల్లూరు ప్రాంతాల ప్రజలు అంతరాయాన్ని గమనించాలని కోరారు.