VZM: పూసపాటిరేగ మండలం పెదనడిపల్లి గ్రామానికి చెందిన శీల రమ (37) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (28)ను నిందితుడిగా అరెస్టు చేసినట్లు SP దామోదర్ బుధవారం తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో ఏర్పడిన వివాదంతో రమను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని, రిమాండ్కు తరలించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్


