ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంటీపీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వివరాలు, ఏర్పాట్లు, మార్పులు తదితర అంశాలపై డీఎల్పీవో కుమార్, తహసీల్దార్ కే.ప్రసాదరావు, ఎంపీడీవో ప్రసాదరావు నాయకులతో చర్చించారు. అనంతరం రాజకీయ నాయకుల సూచనలు, అభిప్రాయాలను అధికారులు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీలతో సమావేశం


