హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రమోషన్ కోటాను 70 శాతానికి పెంచాలీ'

WG: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆచంట మండల వీఆర్ఏ‌లు బుధవారం సమ్మె చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద సామూహిక సహాయ నిరాకరణ దీక్ష ప్రారంభించారు. మండల వీఆర్ఎల సంఘం అధ్యక్షుడు తలుపూరి ముత్యాలరావు మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన డీఏను వెంటనే అమలు చేయాలని, వీఆర్ఎలకు కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.