SKLM: ఆమదాలవలస (M)మునగవలసలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వై.వి.ఎస్. మురళీకృష్ణ పాల్గొని రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పంటలకు ఎరువులను అవసరమైన మోతాదులో, సమతుల్యంగా వినియోగించాలని సూచించారు. పంటల్లో చీడపీడలు, తెగుళ్ల లక్షణాలను తొలిదశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎరువులను సమతుల్యంగా వినియోగించాలి'


