హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ల కోసం 38,500 దరఖాస్తులు

E.G: జిల్లాలో నూతన పెన్షన్ల కోసం ఇప్పటివరకు 38,500 దరఖాస్తులు అందగా, అందులో 37,411 దరఖాస్తులు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. వచ్చిన అర్జీలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి దరఖాస్తును తదుపరి ప్రక్రియకు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.