VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా అండ్ కాన్షియస్నెస్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యోగా విలేజ్లో ఉచిత ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, ప్రకృతి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు విభాగాధిపతి ఆచార్య కె. రమేష్ బాబు తెలిపారు. ఏయూ బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత వైద్య శిబిరం


