హైదరాబాద్: 28°C
తెలంగాణ

'17న బహిరంగ సభను విజయవంతం​ చేయాలి'

NZB: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్​ అన్నారు. ఈనెల 17న నాంపల్లి గ్రౌండ్స్​లో జరిగే సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలను స్మరిస్తూ ఈనెల 17 వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంగళవారం తెలిపారు.