హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు

HYD: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మాజీ హవిల్దార్‌ మల్లేశ్‌ను పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. సికింద్రాబాద్‌ కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఏకే-47లు, పిస్తోళ్లు, మందుగుండు సామగ్రి చోరీపై విచారణ చేపట్టనున్నారు. డిలీట్‌ చేసిన ఫోన్‌ డేటా రికవరీతోపాటు ఆయుధాల చోరీ వెనుక నెట్‌వర్క్‌పై ఆరా తీస్తున్నారు.