హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉప్పల్‌ శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి'

RR: ఉప్పల్‌ నియోజకవర్గంలోని శ్మశాన వాటికలు, సమాధి స్థలాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రహరీ గోడలు, షెడ్లు, తాగునీరు, విద్యుత్‌, ఆధునిక దహన వాటికలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.