హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు చేరుకున్న జిన్‌పింగ్

18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. 2020 నాటి గల్వాన్ ఘర్షణ తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. బ్రిక్స్ సదస్సుకు ముందు ప్రధాని మోదీతో జిన్‌పింగ్‌ ముఖాముఖి చర్చలు జరపనున్నారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్ సంఘర్షణలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఇంధన భద్రత వంటి అంశాలపై వారిరువురు చర్చించనున్నారు.