SRD: అల్లాదుర్గం ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నిరసన ర్యాలీలో ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ను తీసుకెళ్తున్న పోలీసు వాహనం ఢీకొని జర్నలిస్ట్ వీరన్న తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ దురదృష్టకర ఘటనపై పలువురు నాయకులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు.
తెలంగాణ
BRS ర్యాలీలో జర్నలిస్ట్కు గాయాలు


