హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా ధర్నా

NGKL: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి నిరసనగా తెల్కపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.