హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్‌ఎస్‌లో 226 వినతులు స్వీకరణ

VZM: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జేసీ సేధు మాధవన్ సోమవారం అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లో 226 వినతులు స్వీకరించగా, వీటిలో 113 రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. పెండింగ్‌ అర్జీలను సత్వరం పరిష్కరించాలని, రెవెన్యూ, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.