హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ బోల్తా.. రైతు దుర్మరణం

NGKL: నాగర్‌కర్నూల్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా అదుపుతప్పి బోల్తా పడటంతో రైతు ఎడ్ల బాలస్వామి (44) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలస్వామి ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.