హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో జోరుగా వినాయక విగ్రహాల అమ్మకాలు

ATP: జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ వేడుకలకు సంబంధించి వినాయక విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్లో విగ్రహాల లభ్యతను బట్టి కొన్ని వేల రూపాయల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. భక్తులు తమ బడ్జెట్ కు అనుగుణంగా విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్ని ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.