ADB: ప్రజలందరికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ జడ్జి హుస్సేన్ అన్నారు. సోమవారం నేరేడిగొండ మండలంలోని బుగ్గారం గ్రామంలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. చిన్న చిన్న సమస్యలను లోక్ ఆదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్జి సందీప్, సర్పంచ్ రాథోడ్ కృష్ణ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రజలందరికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'


