SRCL: తెలంగాణలో 40 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం వారి భవిష్యత్తుతో ఆడుకుంటోందని BJYM అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా BJYM అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, బీజేపీ మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తెలంగాణ
ఫీజు బకాయిలపై బీజేపీ ఆగ్రహం..!


