భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్ కాలనీ వద్ద సోమవారం చెల్పూర్–భూపాలపల్లి ప్రధాన రహదారిపై లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగిపోయింది. పక్కనే ఉన్న గ్రానైట్ షాప్లోకి దూసుకెళ్లిది. దీంతో రాళ్లు ధ్వంసమై యజమానికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
తెలంగాణ
VIDEO: లారీ బీభత్సం.. భారీ ఆస్తి నష్టం


