హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐ లాబ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఐటీఐల్లో ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా, ఏఐ ప్రయోగశాలల్లో 20 ఉద్యోగాలను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నట్లు కాకినాడ ప్రాంతీయ ఉప సంచాలకుడు మురళీధర్ తెలిపారు. డేటా అన్నోటేటర్‌ 5, డేటా క్యూరేటర్‌ 5, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ 10 పోస్టులకు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.