SS: ధర్మవరంలో అనుమతులు లేకుండా 20 ఏళ్లకు పైగా వయసున్న చెట్టును తొలగించిన ఇంటి యజమానికి అటవీశాఖ రూ.9 వేల జరిమానా విధించింది. కూరగాయల మార్కెట్ సమీపంలో జనార్దన్ నివాసం వద్ద విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్కు అడ్డుగా ఉందని చెట్టును నరికివేశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ కానిస్టేబుల్ అక్కులప్ప ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
చెట్టు నరికివేతకు రూ.9 వేల జరిమానా


