హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణం

BHPL: రామన్నగూడెం చెందిన కాసం శ్రీనివాస్‌రెడ్డి (50) పురుగు మందు తాగి మృతి చెందాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన శ్రీనివాస్‌రెడ్డి మద్యం మత్తులో పాండవులగుట్ట వద్ద పురుగు మందు తాగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.