MDK: రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణికి ప్రజలు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని MPDO షాజీలొద్దీన్ పిలుపునిచ్చారు. ప్రజా ఫిర్యాదుల కోసం 27 శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
రామాయంపేటలో నేడు ప్రజావాణి


