హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో కార్ షోరూమ్‌పై పిడుగు

విజయవాడ పటమట ఆటోనగర్‌ పరిధిలోని ఓ కార్‌ షోరూమ్‌పై ఆదివారం పిడుగు పడింది. దీంతో షోరూమ్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పిడుగుపాటు కారణంగా షోరూమ్‌లో జరిగిన ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.