హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రేమ కోసం దొంగగా మారిన యువతి!

తమిళనాడులో ప్రియుడికి బైక్‌ కొనివ్వాలనే ఉద్దేశంతో 19 ఏళ్ల యువతి దొంగగా మారింది. పోలాచ్చిలోని తన తండ్రి స్నేహితుడి ఇంట్లో 9 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసి, వాటిని రూ.2.5 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఆ డబ్బుతో ప్రియుడికి బైకు కొనిచ్చింది. బైక్‌ ఆవిష్కరణ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.