హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి శనివారం తనిఖీ చేశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో భాగంగా ముందస్తుగా పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబరు 3న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశామని. వీటిపై ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, తుది జాబితాను ప్రకటిస్తామన్నారు.