అన్నమయ్య: మదనపల్లె పట్టణం చీకిలగుట్టకు చెందిన హిజ్రా స్వాతిని మోసగించిన ఢమరేశ్వర్, అతని భార్య స్వర్ణలత, కృష్ణారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఎస్సై నాగేశ్వరరావు శనివారం తెలిపారు. బాధితురాలి వద్ద 650 గ్రాముల బంగారం, నగదు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
హిజ్రాను మోసగించిన ముగ్గురిపై చీటింగ్ కేసు


