హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై పశువులతో వాహనదారులకు ముప్పు

HYD: బండ్లగూడ జాగీర్, కాలిమందిర్ రోడ్లపై పశువులు అడ్డంగా పడుకోవడం, తిరగడం ఏళ్లుగా కొనసాగుతోంది. వీటి కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా మున్సిపల్, ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువుల యజమానులపై చర్యలు తీసుకుని, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.