SRCL: వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రొండి రాజు అధ్యక్షతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలోకి సబ్ రిజిస్టర్ కార్యాలయం వచ్చినందున నూతనంగా రూ. 67 లక్షలతో షేటర్లు వేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు.
తెలంగాణ
వేములవాడ మార్కెట్ కమిటీ సమావేశం


