హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ భారతి కాదు భూ దోపిడీ: DK అరుణ

HYD: ఇందిరాపార్క్–ధర్నా చౌక్‌లో బీజేపీ చేపట్టిన రెండు రోజుల మహా దీక్షలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. 22ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. భూభారతి పోర్టల్‌తో రైతులకు న్యాయం జరగడం లేదని, 22ఏను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.