హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన చెరువును పరిశీలించిన కమిషనర్

RR: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఎల్బీనగర్ సర్కిల్–13 పరిధిలోని బైరామల్‌గూడ వద్ద ఏర్పాటు చేసిన పోర్టబుల్ నిమజ్జన చెరువును ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ పరిశీలించారు. అనంతరం సాగర్ రింగ్ రోడ్డు వద్ద ప్రజల సౌకర్యార్థం ప్రజా మరుగుదొడ్ల నిర్మాణ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. పౌర సదుపాయాల మెరుగుదలపై అధికారులకు సూచనలు చేశారు.