హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరాంజనేయ స్వామిని దర్శించిన ఎమ్మెల్యే

CTR: చౌడేపల్లి మండలంలో సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి శనివారం సందర్శించారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన అనంతరం ఎమ్మెల్యేతో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు.