హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ సదస్సు జయప్రదం చేయండి'

PLD: ఈనెల 9న విజయవాడలో జరగనున్న విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జొన్నలగడ్డలోని 220 కేవీ విద్యుత్ కేంద్రంలో సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.