హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధరలు తగ్గించాలని 7న కలెక్టరేట్ వద్ద ధర్నా

PPM: నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 7న కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఐద్వా కొమరాడ మండల నాయకురాలు కొల్లి సురేఖ పిలుపునిచ్చారు. శనివారం కొమరాడ మండల కేంద్రంలో మహిళలతో కలిసి నిరసన చేపట్టారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.