హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విత్తన వివరాలను ఆన్‌లై‌న్ లో నమోదు చేసుకోవాలి'

MNCL: జన్నారం మండలంలోని రైతులు ప్రభుత్వం ఇచ్చే రూ. 500 బోనస్ ను పొందేందుకు సెప్టెంబర్ 10 లోపు వరి విత్తనాల వివరాలను ఆన్‌లై‌న్‌లో నమోదు చేయించుకోవాలని స్థానిక ఏవో వీరన్న కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే బోనస్‌ను పొందేందుకు ఏడు రకాల వరి విత్తనాలను మాత్రమే కొనాల్సి ఉంటుందన్నారు. ఆ విత్తనాల వివరాలను వ్యాపారుల వద్ద రైతులు నమోదు చేయించాలని కోరారు.